బద్రాద్రి కొత్తగూడెం జూలై 27(పున్నమి వార్తలు)
క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి షెడ్యూల్డ్ కులం
(ఎస్సీ) హోదా వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును
సమర్థిస్తూ, రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనల
ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందినవారికే
ఎస్సీ హోదా వర్తిస్తుందని పేర్కొంది. ఇతర మతాల్లోకి
మారితే ఎస్సీ హోదా కొనసాగదని, తిరిగి హిందూ,
సిక్కు లేదా బౌద్ధ మతంలోకి వచ్చిన తర్వాత మాత్రమే
సంబంధిత నిబంధనల మేరకు ఎస్సీ హోదా పొందే
అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.


