మంగళవారం కంచరపాలెం హై వే ధర్మానగర్ వద్ద *జేడీ ఫౌండేషన్* ఆధ్వర్యంలో స్థానికుల సహకారంతో *జలమే జీవం* కార్యక్రమంలో భాగంగా పురాతన బావిలో పూడిక తీసివేయడం జరిగింది, సుమారు 75 సంవత్సరాల క్రితం గ్రామస్తులు అందరూ కలసి తవ్వుకున్న బావి నేడు పట్టణీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో బావి వాడుక మానేయడం వలన ప్లాస్టిక్ , పిచ్చి మొక్కలతో బావి నిండి పోవడంతో స్థానికుల విన్నపంతో జేడీ ఫౌండేషన్ ,స్థానికుల సహకారంతో పూడిక తీసివేయడం జరిగింది,త్వరలో చుట్టూ ఉన్న డాబాల పై వాన నీటిని బావి లోనికి మళ్ళించే ఏర్పాటు చేయడం జరుగును, కాలనీ సభ్యులు యర్రా నాయుడు ,మహిళలు మాట్లాడుతూ పురాతన బావికి జీవం పోసిన జేడీ ఫౌండేషన్ కు ధన్యవాదాలు తెలిపారు, ఈకార్యక్రమంలో పలిశెట్టి రాజు,పిల్లల రవి ఇతర కాలనీ సభ్యులు,జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు …..



