అలంపూర్ : అక్టోబర్ 30 ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్, దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఐదో శక్తిపీఠం జోగులాంబ దేవికి మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున కర్నూలు జిల్లా కలెక్టర్ ఎ.సిరి పట్టు వస్త్రాలు సమర్పించారు. కలెక్టర్కు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా దసరా నవరాత్రుల్లో జోగులాంబ అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని కలెక్టర్ తెలిపారు.

ఏపీ ప్రభుత్వం తరఫున జోగులాంబకు పట్టు వస్త్రాల సమర్పణ.
అలంపూర్ : అక్టోబర్ 30 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్, దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఐదో శక్తిపీఠం జోగులాంబ దేవికి మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున కర్నూలు జిల్లా కలెక్టర్ ఎ.సిరి పట్టు వస్త్రాలు సమర్పించారు. కలెక్టర్కు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా దసరా నవరాత్రుల్లో జోగులాంబ అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని కలెక్టర్ తెలిపారు.

