ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ సమయంలో టెయిల్ స్ట్రైక్కు గురైంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఘటన తర్వాత విమానాన్ని సాంకేతిక తనిఖీల కోసం నిలిపివేశారు. దీంతో బెంగళూరు-ఢిల్లీ తిరుగు ప్రయాణ విమానాన్ని రద్దు చేశారు. మరో విమానం టేకాఫ్ సమయంలో ఏర్పడిన గాలి ప్రభావం వల్ల ఈ ఘటన జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది
ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ సమయంలో టెయిల్ స్ట్రైక్కు గురైంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఘటన తర్వాత విమానాన్ని సాంకేతిక తనిఖీల కోసం నిలిపివేశారు. దీంతో బెంగళూరు-ఢిల్లీ తిరుగు ప్రయాణ విమానాన్ని రద్దు చేశారు. మరో విమానం టేకాఫ్ సమయంలో ఏర్పడిన గాలి ప్రభావం వల్ల ఈ ఘటన జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.

