పున్నమి ప్రతినిధి, రామచంద్రపురం జూలై 29
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పై వైసీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేయడం తగదని టిడిపి మండల అధ్యక్షుడు తిరుమలరెడ్డి అన్నారు. బుధవారం టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయల చెరువు పేటలో కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడిన సంజీవి సుబ్రహ్మణ్యం తెలుగుదేశం కార్యకర్తెనని పేర్కొన్నారు. మృతుడు సుబ్రహ్మణ్యం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు హరికి దగ్గర బంధువులు అన్నారు. ఇంటి దగ్గర సంజీవ హరి భార్య సంజీవ సునీతకు సంజీవ సుబ్రహ్మణ్యం మధ్య
– మృతుడు సంజీవ సుబ్రహ్మణ్యం టిడిపి కార్యకర్తే, టిడిపి నేతలు
జరిగిన చిన్న వివాదానికి సునీత పోలీసులకు ఫిర్యాదు చేయడం పోలీసులు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను పిలిచి మందలించడం గ్రామ పెద్దల సమక్షంలో రాజీ చేయడం జరిగిందన్నారు. దీనిపై మోహిత్ రెడ్డి సోషల్ మీడియా వేదిక ఎమ్మెల్యే అనుచరులు చేసిన అరాచకంకు సుబ్రహ్మణ్యం ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణ చేయడాని ఆయన ఖండించారు. మోహిత్ రెడ్డి పూర్తిగా సమాచారం
తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. శవ రాజకీయాలు, కుట్ర రాజకీయాలు మానుకోవాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హితువు
పలికారు. టిడిపి సీనియర్ నాయకులు మాదాసు. మాధవయ్య మాట్లాడుతూ కూటమిలో చిచ్చు పెట్టడానికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎమ్మెల్యే నాని పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శిం చారు. మా టిడిపి కార్యకర్త అయిన సంజీవ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యే ఎప్పుడు పడుతున్నాని అన్ని విధాల ఆదుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గురవయ్య గిరిధర్ యాదవ్, రవి మృతుని బంధువులు పాల్గొన్నారు.


