భద్రాద్రి కొత్తగూడెం:- (పున్నమి న్యూస్) 16/08/2026 చుంచుపల్లి మండలం రామవరం బ్రిడ్జి నుండి 14 నెంబర్ చెక్ పోస్ట్ వెళ్లే రహదారి పైన రాత్రి వేళలా మూగజీవుల రోడ్డుపైన సంచరిస్తున్నాయి, ఆవులు గేదలు రోడ్డుపైన వచ్చే వాహనాలకు అడ్డుగా ఉంటున్నాయి. గత నెల రోజుల నుంచి చాలా ఆక్సిడెంట్లు జరిగాయి చాలా మూగజీవులు చనిపోయాయి ఆక్సిడెంట్లలో మనుషులకి కూడా గాయాలు అయ్యి హాస్పిటల్ పాలయ్యారు. ఆవులు అన్ని రోడ్డుపైన జీవిస్తూ వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ అంశం పైన యువజన కాంగ్రెస్ కొత్తగూడెం ఉపాధ్యక్షులు ఉర్సు శివశంకర్ గారు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి ఆగస్టు 3వ తారీఖున వినతి పత్రం అందజేయగా. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు వెంటనే స్పందించి మునిసిపాలిటీ వర్కర్లను పంపించి రోడ్డుకి అడ్డుగా ఉన్న మూగజీవులను రోడ్డుకి అడ్డుగా లేకుండా ప్రమాదాలు జరగకుండా వాటన్నిటిని రోడ్డుపైన నుంచి పంపించడం జరిగింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారము చూపగలరు.


