అమెరికా ఇండో-పసిఫిక్ విధానంలో భారత్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమైన ఆయన, ఈ ఏడాది చివర్లో అమెరికా పర్యటనకు అధికారిక ఆహ్వానం అందించారు.
క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు భారత్కు వచ్చిన రూబియో, భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. రక్షణ, సాంకేతికత, విద్య, వాణిజ్యం, ఇంధన భద్రత వంటి రంగాల్లో సహకారం పెరుగుతోందని తెలిపారు.
ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ను ప్రభావితం చేయనివ్వబోమని అమెరికా స్పష్టం చేసినట్లు సమాచారం. భారత్కు అమెరికా ఇంధన సరఫరా ప్రత్యామ్నాయంగా మారవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ భేటీతో భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.


