అరకులోయ సుంకరమెట్టలోని ప్రముఖ ఎకో టూరిజం ఉడెన్ బ్రిడ్జి వద్ద జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలన క్లీనప్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా టూరిజం అధికారి పట్టాసి చలపతిరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత, పరిశుభ్ర, స్నేహపూర్వక పర్యాటక వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు. పర్యాటక కేంద్రాల్లో నెలకు ఒకరోజు స్వచ్ఛత కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వి.ప్రసాద్, APFDC డివిజినల్ మేనేజర్ జి. కృష్ణబాబు, రేంజ్ ఆఫీసర్ కె ఆశేష, పంచాయతీ సిబ్బంది, ఎకో టూరిజం కమిటీ సభ్యులు, చిరు వ్యాపారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

అరకు: పరిశుభ్ర, బాధ్యతాయుత టూరిజమే లక్ష్యం
అరకులోయ సుంకరమెట్టలోని ప్రముఖ ఎకో టూరిజం ఉడెన్ బ్రిడ్జి వద్ద జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిర్మూలన క్లీనప్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా టూరిజం అధికారి పట్టాసి చలపతిరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత, పరిశుభ్ర, స్నేహపూర్వక పర్యాటక వాతావరణం కల్పించడమే లక్ష్యమన్నారు. పర్యాటక కేంద్రాల్లో నెలకు ఒకరోజు స్వచ్ఛత కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వి.ప్రసాద్, APFDC డివిజినల్ మేనేజర్ జి. కృష్ణబాబు, రేంజ్ ఆఫీసర్ కె ఆశేష, పంచాయతీ సిబ్బంది, ఎకో టూరిజం కమిటీ సభ్యులు, చిరు వ్యాపారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

