అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలోని శ్రీ రెడ్డమ్మ దేవత దేవస్థాన ఆలయ అభివృద్ధికి మదనపల్లికి చెందిన రెడ్డి కుషాల్ రూ.1,00,000, ఏర్పేడుకు చెందిన కైలాసం రెడ్డి ప్రకాష్ రూ.25,116 విరాళంగా అందించారు. దాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. విరాళాన్ని ఆలయ ఖాతాలో జమ చేయనున్నట్లు ఈవో మంజుల తెలిపారు. దాతలకు చైర్మన్ శ్రీలంకిపల్లి రాజన్న నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.



