అమరావతిని ప్రపంచ స్థాయి ఆరోగ్య కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరులో 600 పడకలు, 32 ప్రత్యేక వైద్య విభాగాలతో నిర్మించిన లలితా హాస్పిటల్ను ప్రారంభించిన ఆయన, హెల్త్ టూరిజాన్ని ప్రోత్సహించి విదేశాల నుంచి కూడా రోగులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘సంజీవని’ ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు, ఇంటి వద్ద వైద్య పరీక్షలు అందిస్తున్నామని వెల్లడించారు. ఆరోగ్యమే అసలైన సంపద అని పేర్కొంటూ, మంచి ఆహారం, వ్యాయామం, యోగా అలవాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. లలితా హాస్పిటల్ రాష్ట్ర ఆరోగ్య రంగంలో ఆదర్శ సంస్థగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అమరావతి ఆరోగ్య కేంద్రం: నారా చంద్రబాబు నాయుడు
అమరావతిని ప్రపంచ స్థాయి ఆరోగ్య కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరులో 600 పడకలు, 32 ప్రత్యేక వైద్య విభాగాలతో నిర్మించిన లలితా హాస్పిటల్ను ప్రారంభించిన ఆయన, హెల్త్ టూరిజాన్ని ప్రోత్సహించి విదేశాల నుంచి కూడా రోగులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘సంజీవని’ ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు, ఇంటి వద్ద వైద్య పరీక్షలు అందిస్తున్నామని వెల్లడించారు. ఆరోగ్యమే అసలైన సంపద అని పేర్కొంటూ, మంచి ఆహారం, వ్యాయామం, యోగా అలవాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. లలితా హాస్పిటల్ రాష్ట్ర ఆరోగ్య రంగంలో ఆదర్శ సంస్థగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

