శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరం లో ఆదివారం పదవీ విరమణ పొందిన అదనపు ఎస్పీ శ్రీ జి.గంగరాజు, డిస్పీ టి.పాల్గుణరావు, Offce Supdt., పి. రాజేశ్వరరావు, AR RSI జి. నాగరాజు, AR హెడ్ కానిస్టేబుల్ ఆర్ సి హెచ్ ప్రధాని గార్లను ఎస్పీ ఆర్. ఎన్. అమ్మిరెడ్డి వారు భౌతిక దూరం పాటిస్తూ దుశ్శాలువ తో సన్మానం చేసి, చిరు జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్బంగా ఎస్పీ వారు మాట్లాడుతూ, గంగరాజు గారు మృదు స్వభావని, అంకిత భావంతో పనిచేసి, తనదైన శైలిలో క్రైమ్ కేసులు ను ఎన్నో ఛేదించారని, విధుల్లో ముక్కుసూటి గాఉంటారని, మంచి మనసుతో క్రింది స్థాయి తన సిబ్బంది అభిమానాన్ని పొందారని అన్నారు.
గంగరాజు గారు మాట్లాడు తూ శ్రీకాకుళం జిల్లా ప్రజలు, ఇక్కడ సిబ్బంది ఎంతో సౌమ్యులని, కష్టపడి పనిచేస్తారని, ఈ జిల్లా వచ్చే ముందు చాలా దూరం బదిలీ అయిందని బాధపడుతూ వచ్చాను కానీ ఈ రోజు వెళ్లేందుకు బాధపడుతున్నా అని బావుద్వేగంతో అన్నారు
G.గంగరాజు గారు 1984 సం లో RSI గాను చేస్తూ, గ్రూప్ ll లో ఎంపికై 1985 లో సివిల్ ఎస్.ఐ గా చేస్తూ Ci, DSP, అదనపు ఎస్పీ గా పదోన్నతి ని పొందినారు.
డిఎస్పీ టి.పాల్గుణరావు గారు 1989 లో ఎస్. ఐ గా పోలీస్ శాఖ లో చేరి డిస్పీ గాను, పి. రాజేశ్వరరావు గారు 1986 లో జూనియర్ అసిస్టెంట్ గా పోలీస్ శాఖ లో చేరి Offce Supdt., గాను, G.నాగరాజు 1979 లో AR కానిస్టేబుల్ గా చేరి RSI గాను, ఆర్ సి హెచ్ ప్రధాని గారు 1984 లో కానిస్టేబుల్ గా చేరి హెడ్ కానిస్టేబుల్ గాను పదోన్నతిలు పొంది ఈ రోజు ఆరోగ్యం గా పదవీ విరమణ పొందడం ఎంతో అదృష్టవంతులుగా భావించాలని ఎస్పీ అన్నారు.
* ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పీ కె. శ్రీనివాసరావు గారు, డిఎస్పీ DSRVSN మూర్తి, రారాజు ప్రసాద్, సత్యనారాయణ, శివరామ రెడ్డి, Ch.G.V.ప్రసాద్, శ్రీనివాసరావు, శ్రీలత,పరిపాలన అధికారి ప్రసాద్ గారు, కార్యాలయ సిబ్బంది, సి.ఐ లు, ఆర్. ఐ లు, కుటుంబ సభ్యులు, అధికారుల సంఘం ప్రెసిడెంట్ కె అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

