ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 10 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు జాతీయ రహదారిపై రోడ్డు భద్రత, అక్రమ రవాణా నియంత్రణ లక్ష్యంగా పోలీసులు, రవాణా శాఖ అధికారులు మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఎస్సై శివ రాకేష్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉషారాణి ఆధ్వర్యంలో వాహనాల పత్రాలు, ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర అంశాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా నడిచే ప్రైవేట్ బస్సులు, లారీలు, అదనపు సీట్లు ఏర్పాటు చేసిన వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మాదకద్రవ్యాలు, మద్యం, అక్రమ నగదు రవాణా అరికట్టేందుకు నిఘా పెంచినట్లు తెలిపారు. అనంతరం మనుబోలు సుశ్రుత హైస్కూల్లో స్కూల్ బస్సులను తనిఖీ చేసి అవగాహన కల్పించారు.

హైవేపై పోలీస్-రవాణా శాఖ సంయుక్త తనిఖీలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 10 (పున్నమి ప్రతినిధి) మనుబోలు జాతీయ రహదారిపై రోడ్డు భద్రత, అక్రమ రవాణా నియంత్రణ లక్ష్యంగా పోలీసులు, రవాణా శాఖ అధికారులు మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఎస్సై శివ రాకేష్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉషారాణి ఆధ్వర్యంలో వాహనాల పత్రాలు, ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తదితర అంశాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా నడిచే ప్రైవేట్ బస్సులు, లారీలు, అదనపు సీట్లు ఏర్పాటు చేసిన వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మాదకద్రవ్యాలు, మద్యం, అక్రమ నగదు రవాణా అరికట్టేందుకు నిఘా పెంచినట్లు తెలిపారు. అనంతరం మనుబోలు సుశ్రుత హైస్కూల్లో స్కూల్ బస్సులను తనిఖీ చేసి అవగాహన కల్పించారు.

