పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామంలో హమాలీ కార్మికుల సంఘం గ్రామ శాఖ సమావేశం శాఖ అధ్యక్షులు ఎస్ బాలస్వామి అధ్యక్షతన జరిగింది, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటియుసి నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకరం పాల్గొని మాట్లాడుతూ కల్వకోల్ గ్రామం తో పాటు మండలాల్లోని కార్మికులు కర్షకులు అసంఘటిత రంగ కార్మికులు అందరూ కార్మిక లోకం అధిక సంఖ్యలో పాల్గొని నాగర్ కర్నూలు జిల్లా మూడో మహాసభలు తాడూరు మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు పై కార్యాచరణ రూపొందించి ఉద్యమాలకు వేదికగా మారుతుందని అన్నారు,
ఏఐటీయూసీ 1920లో అక్టోబర్ 31న ఆవిర్భవించి ఎన్నో సవాళ్లను ఒత్తిళ్ళను ఎదుర్కొని నిలబడి కార్మిక హక్కులను సాధించిన సంఘం ఏదైనా ఉంది అంటే ఏకైక సంఘం ఏఐటీయూసీ సంఘం నేటికీ 106 సంవత్సరాలు నిండిన ఉరకలేసే సంఘంలో పనిచేస్తుందని ఆయన తెలిపారు,
ఈ కార్యక్రమంలో కల్వకోలు సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి, సంఘం కృష్ణ, కల్వకోలు హమాలీ సంఘం గ్రామ సహాయ కార్యదర్శి కే,వెంకటస్వామి, ఎన్ శివుడు, కే కృష్ణయ్య, జి లక్ష్మయ్య, ఎస్ జంపన్న, కే ఎల్లయ్య, కే రాముడు, ఎస్ చిన్నయ్య, పి రాముడు, కే సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు


