పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో జరిగిన హత్య కేసులో పల్లపు సురేష్ కు సహకరించిన కంచర్ల సతీష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు దర్యాప్తులో భాగంగా సతీష్ ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు గతంలో భార్యను హత్య చేసిన పల్లపు సురేష్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసింది



