ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్)
స్వయంభూ అభయ వెంకటేశ్వరస్వామి ఆలయ పార్కింగ్ స్థలం కొనుగోలు కోసం ఆర్థిక సహకారం అందించిన దాతలను దేవస్థాన కమిటీ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా దాసరి వీరభద్రం–అనిత దంపతులు రూ.15,116, కక్కెర రామారావు–పద్మావతి దంపతులు రూ.15,116 విరాళంగా అందజేశారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన దాతలకు దేవస్థాన కమిటీ చైర్మన్ అల్లిక అంజయ్య, కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి భక్తులు ఇలాగే సహకరించాలని కోరారు.



