వింజమూరు మండల కేంద్రంలో నిర్వహించిన “స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కంభం కంభం విజయరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశుభ్రత, పచ్చదనం, ఆరోగ్యకరమైన వాతావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండటం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని, పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు
వింజమూరు మండల కేంద్రంలో నిర్వహించిన “స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కంభం కంభం విజయరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశుభ్రత, పచ్చదనం, ఆరోగ్యకరమైన వాతావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండటం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని, పరిశుభ్రమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

