Hyd: రామంతాపూర్ లోని ప్రభుత్వ హోమియో అస్పత్రి వద్ద ఆయూష్ హౌస్ సర్జన్లు మరియు పీజీ వైద్య విద్యార్థులు వారికి చెల్లిస్తున్నటువంటి స్టైపెండ్
పెంచాలని డిమాండ్ చేస్తూ నిరవదిక సమ్మె చేపట్టారు. ప్రజలకు నిరంతరం ఆరోగ్య సేవలు అందిస్తున్నా కూడా గత దశాబ్ధకాలంగా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభత్వం పట్టించు కోవట్లేదని ఆగ్రహం వ్యక్తంచెసారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ లోనే అత్యల్ప స్టైపెండ్ ఇస్తున్నారని పేర్కొంటూ తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని లేనిచో ఆందోళనలను ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.


