ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 27 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని మనుబోలు, కొమ్మలపూడి, రాజవోలపాడు, చెరుకుమూడి గ్రామాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని అధికారులు శనివారం తనిఖీ చేశారు. అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిణి తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో జలజాక్షి క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ అధికారుల పనితీరును పరిశీలించారు. సూపర్వైజర్లు, బీఎల్వోలకు అవసరమైన సూచనలు, దిశానిర్దేశాలు అందించారు. శని, ఆదివారాల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపులను ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అరుణ్ తేజ, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ గాయత్రి, సీనియర్ సహాయకుడు విజయ్కుమార్, డిప్యూటీ సర్వేయర్ అనురూప్ తదితరులు పాల్గొన్నారు.

సర్ కార్యక్రమాన్ని తనిఖీ చేసిన అధికారులు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 27 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని మనుబోలు, కొమ్మలపూడి, రాజవోలపాడు, చెరుకుమూడి గ్రామాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని అధికారులు శనివారం తనిఖీ చేశారు. అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారిణి తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో జలజాక్షి క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ అధికారుల పనితీరును పరిశీలించారు. సూపర్వైజర్లు, బీఎల్వోలకు అవసరమైన సూచనలు, దిశానిర్దేశాలు అందించారు. శని, ఆదివారాల్లో నిర్వహించే ప్రత్యేక క్యాంపులను ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అరుణ్ తేజ, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ గాయత్రి, సీనియర్ సహాయకుడు విజయ్కుమార్, డిప్యూటీ సర్వేయర్ అనురూప్ తదితరులు పాల్గొన్నారు.

