వేల్పూర్ పరిధిలోగల గోవిందగిరి దివ్య యోగాశ్రమంలో గురువారం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాల్ని వైభవంగా నిర్వహించారు. ధ్యాన మందిరంలో సామూహికంగా భజనలు చేశారు. అన్నపూజ, గోమాత పూజ అన్నదాతల సమక్షంలో నిర్వహించారు. పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని సీతారాం పల్లె గ్రామానికి చెందిన సుంకిశాల తనూశ్రీ నవీన్ గౌడ్ దంపతులు, అంక్సాపూర్ గ్రామానికి చెందిన దీకొండ లావణ్య మాధవ్ దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి పూజను చేసి అన్నదానం చేశారు. కార్యక్రమంలో అబ్బగోని జగదీశ్వర్ గౌడ్, నోముల గంగారెడ్డి, మోహన్, గడ్డం మల్లేష్, దమ్మాయి లక్ష్మి, కొండ అశోక్ గౌడ్, కుంట సువర్ణ, కోరెం గోపి స్వామి, కండక్టర్ నర్సయ్య, కంకణాల రాజేశ్వర్, కమిటీ సభ్యులు, భజన కళాకారులు, సాయి సేవకులు, సాయి భక్తులు తదితరులు పాల్గొన్నారు.




