విశాఖపట్నం విమానాశ్రయం మూసివేయడంతో విమానాశ్రయంలో పని చేస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బందిని తిరిగి మళ్ళీ పనిలోకి తీసుకోకుండా వదిలేయడంతో కార్మికులందరూ తమకు న్యాయం చేయాలని గత ఆరు రోజులుగా ఎయిర్ పోర్టు వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసనలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె రాజు ,వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు.ఈకార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షడు బి.వి రామ్ ,మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్,నియోజకవర్గ పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు,సీనియర్ నాయకులు సనపల రవీంద్ర భరత్,యం.సునీల్,పి.హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


