రఘునాథపాలెం /ఖమ్మం
ఖమ్మంజిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ నెల్లూరి కోటేశ్వరరావు ఆదేశాల మేరకు రఘునాథపాలెం మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని కోరుతూ మండల తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీడీవోను కలిసి చేయూత పింఛన్లు పార్టీలకు అతీతంగా నిజమైన అర్హులందరికీ అందించాలని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన ప్రతి లబ్ధిదారునికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గుత్తా వంశీ, ప్రధాన కార్యదర్శి భూక్యా బాలాజీ నాయక్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గంధసిరి వీరభద్రం గౌడ్, మండల ఉపాధ్యక్షులు పసుపులేటి నరసింహారావు, సోషల్ మీడియా కన్వీనర్ గొర్రె సాయి చైతన్య పాల్గొన్నారు.



