రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాక్షి ఫోటోగ్రాఫర్ రఫీకి వైఎస్ఆర్సీపీ నాయకుల పరామర్శ
కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాక్షి ఫోటోగ్రాఫర్ శ్రీ రఫీని వైఎస్ఆర్సీపీ నాయకులు పరామర్శించారు.
వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, కడప నగర మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ బండి నిత్యానంద రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీ పులి సునీల్ కుమార్, కడప నగరం యువజన విభాగ అధ్యక్షులు శ్రీ గుంటి నాగేంద్ర, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి బండి దీప్తి రఫీని పరామర్శించారు.
ఈ సందర్భంగా రఫీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నాయకులు, ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
రఫీ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.


