శ్రీ కాళహస్తి, మే 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ రైతులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రోత్సాహకాలుగా 5 లీటర్లు, 4 లీటర్ల కుక్కర్లను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సంఘం చైర్మన్ మునగాల మధుసూదన్ రావు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మధుసూదన్ రావు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆయన సతీమణి బొజ్జల రిషీతా రెడ్డిని కలిసి కార్యక్రమ నిర్వహణపై చర్చించారు. ఎమ్మెల్యే సూచనలు, సలహాల మేరకు రైతుల ప్రోత్సాహకాల పంపిణీ తేదీని త్వరలో ప్రకటించి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

రైతులకు కుక్కర్ల ప్రోత్సాహకాలు.. త్వరలో పంపిణీ
శ్రీ కాళహస్తి, మే 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ రైతులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రోత్సాహకాలుగా 5 లీటర్లు, 4 లీటర్ల కుక్కర్లను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సంఘం చైర్మన్ మునగాల మధుసూదన్ రావు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మధుసూదన్ రావు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆయన సతీమణి బొజ్జల రిషీతా రెడ్డిని కలిసి కార్యక్రమ నిర్వహణపై చర్చించారు. ఎమ్మెల్యే సూచనలు, సలహాల మేరకు రైతుల ప్రోత్సాహకాల పంపిణీ తేదీని త్వరలో ప్రకటించి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

