మోదీ గారి జన్మదినం సందర్భంగా మైలవరంలో ‘ఆశీర్వాద్ కా దియా’
దేశ ప్రగతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి దీపాలు వెలిగించి ఆశీస్సులు – మద్దతు తెలియజేయాలి: ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం:
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మైలవరం శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎన్టీఆర్ జిల్లా వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని దీపాలు వెలిగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ దేశ ప్రగతి, అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి ప్రధాని మోదీ గారికి ఆశీస్సులు, మద్దతు తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రజా సేవకు గుర్తుగా నిర్వహించిన ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇళ్ల వద్ద దీపాలు వెలిగిస్తూ ప్రధానమంత్రి మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజల సంక్షేమం, దేశ ప్రగతి నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఈ దీపోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు.



