రాజన్న సిరిసిల్ల జిల్లా /ఏప్రిల్ /పున్నమి ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పురాతన వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కె.కె. మహేందర్ రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు చక్రధర్ రెడ్డి గారు, ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి గారు మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.
ఆలయ పునర్నిర్మాణం ద్వారా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ప్రాంతీయ ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుందని నాయకులు తెలిపారు. కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య కొనసాగింది.


