నంద్యాల: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితిని పురస్కరించుకుని నంద్యాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త గోళ్ళ రాజేష్ 3,000 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు కల్పనా సెంటర్లోని టెక్కె మార్కెట్ యార్డ్ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతాయని, ప్రతీ ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని గోళ్ళ రాజేష్ పిలుపునిచ్చారు. గత రెండేళ్లుగా వడ్డీ లేని రుణాలు అందించడమే కాకుండా, సర్వమత ప్రార్థనా మందిరాల అభివృద్ధికి సాయం అందిస్తున్న ఆయన సేవలను పలువురు అభినందించారు.

మట్టి వినాయకుల ఉచిత పంపిణీ : గోళ్ళ రాజేష్
నంద్యాల: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితిని పురస్కరించుకుని నంద్యాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త గోళ్ళ రాజేష్ 3,000 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు కల్పనా సెంటర్లోని టెక్కె మార్కెట్ యార్డ్ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతాయని, ప్రతీ ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని గోళ్ళ రాజేష్ పిలుపునిచ్చారు. గత రెండేళ్లుగా వడ్డీ లేని రుణాలు అందించడమే కాకుండా, సర్వమత ప్రార్థనా మందిరాల అభివృద్ధికి సాయం అందిస్తున్న ఆయన సేవలను పలువురు అభినందించారు.

