నంద్యాల: పర్యావరణ పరిరక్షణ, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 14న జరుపుకునే వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని DYFI నంద్యాల పట్టణ కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో డాక్టర్ కార్తికేయన్ చేతుల మీదుగా ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు. రసాయనాలతో తయారుచేసే విగ్రహాల వల్ల ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని, అందుకే భక్తిశ్రద్ధలతో మట్టి విగ్రహాలను పూజించాలని డాక్టర్ కార్తికేయన్, DYFI పట్టణ కార్యదర్శి శివ సూచించారు.పండుగ ఐదు రోజులు వార్డుల్లో ఉత్సాహంగా సేవా కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు నీటి సదుపాయం, నిమజ్జన ఏర్పాట్లు మరియు భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో DYFI సహాయ కార్యదర్శి సాయి, నాయకులు తేజ, హరీష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

మట్టి వినాయకుని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం: DYFI
నంద్యాల: పర్యావరణ పరిరక్షణ, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 14న జరుపుకునే వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని DYFI నంద్యాల పట్టణ కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు స్టార్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో డాక్టర్ కార్తికేయన్ చేతుల మీదుగా ప్రత్యేక పోస్టర్ను విడుదల చేశారు. రసాయనాలతో తయారుచేసే విగ్రహాల వల్ల ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని, అందుకే భక్తిశ్రద్ధలతో మట్టి విగ్రహాలను పూజించాలని డాక్టర్ కార్తికేయన్, DYFI పట్టణ కార్యదర్శి శివ సూచించారు.పండుగ ఐదు రోజులు వార్డుల్లో ఉత్సాహంగా సేవా కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు నీటి సదుపాయం, నిమజ్జన ఏర్పాట్లు మరియు భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో DYFI సహాయ కార్యదర్శి సాయి, నాయకులు తేజ, హరీష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

