పున్నమి: రంగారెడ్డి జిల్లా:భూపేష్ గుప్తా నగర్ లో శ్రీ నల్ల పోచమ్మ దేవస్థానంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. శ్రీ పోచమ్మ దేవాలయంలో బోనాల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు బోనాల సమర్పణతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ పీపుల్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నేషనల్ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
గవ్వల భరత్ కుమార్, ఎల్బీనగర్ కురుమ సంఘం అధ్యక్షులు బలం ఈశ్వర్, అమ్మవారిని దర్శించుకోవడం జరిగినది.
ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ నారగొని శ్రీనివాస్ యాదవ్, భరత్, బాలమేశ్వర్ వారిని సన్మానించడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచమ్మ దేవాలయ బోనాల మహోత్సవం ఘనంగా జరగడం సంతోషకరమన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని పోచమ్మ అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తి, ఆధ్యాత్మికతతో పాటు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు. బోనాల వేడుకలను భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలం గౌతమ్, సత్యనారాయణ,చందు,కార్తీక్ పోచమ్మ దేవాలయ కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు, చిన్నారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






