బెంగళూరులో అమెరికా పౌరులను మోసం చేస్తున్న నాలుగు నకిలీ కాల్ సెంటర్లను కర్ణాటక సైబర్ క్రైమ్ పోలీసులు బస్టు చేశారు. అమెరికన్ అకౌంటింగ్ కంపెనీ పేరుతో నకిలీ సేవలు అందిస్తూ భారీగా డబ్బు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నకిలీ ట్యాక్స్ సలహాలు, సాఫ్ట్వేర్ లైసెన్స్ సేవల పేరుతో మోసం చేసినట్లు గుర్తించారు. దాడుల్లో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, స్క్రిప్ట్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి మోసాలకు ఉపయోగించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

బెంగళూరులో నకిలీ కాల్ సెంటర్ల గుట్టురట్టు
బెంగళూరులో అమెరికా పౌరులను మోసం చేస్తున్న నాలుగు నకిలీ కాల్ సెంటర్లను కర్ణాటక సైబర్ క్రైమ్ పోలీసులు బస్టు చేశారు. అమెరికన్ అకౌంటింగ్ కంపెనీ పేరుతో నకిలీ సేవలు అందిస్తూ భారీగా డబ్బు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నకిలీ ట్యాక్స్ సలహాలు, సాఫ్ట్వేర్ లైసెన్స్ సేవల పేరుతో మోసం చేసినట్లు గుర్తించారు. దాడుల్లో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, స్క్రిప్ట్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి మోసాలకు ఉపయోగించినట్లు దర్యాప్తులో బయటపడింది. ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

