గుంటూరు, సెప్టెంబరు 11 (పున్నమి ప్రతినిధి): గుంటూరులో నిర్వహించిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించగా, జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 160 మంది పదాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకల నిర్వహణ, రాష్ట్ర రాజకీయ పరిణామాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు.






