అనారోగ్యంతో కన్నుమూసిన గౌరారం గ్రామానికి చెందిన ఆనమోని ప్రభాకర్ కుటుంబాన్ని మంగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల 2009-10 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు పరామర్శించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సదరు కుటుంబానికి తమవంతు సహాయంగా రూ.26,000 సేకరించి అందజేశారు. స్నేహితుడి మరణం తీవ్రంగా కలచివేసిందని, వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు. పూర్వ విద్యార్థులు చూపిన ఉదారతపై గ్రామంలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


