వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని పి.పి.కుంట వద్ద ఉన్న సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీలో బ్లూ బర్డ్ కాంటాక్టర్ల ముఠా దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. కష్టపడి రాత్రింబవళ్లు పనిచేయించుకుని, వేతనాలు అడిగితే కాంటాక్టర్లు ఓబయ్య మరియు మధు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బిల్లులు రాలేదంటూ సాకులతో కాలయాపన చేస్తూ, ఫోన్ చేసినా స్పందించడం లేదని వాపోతున్నారు. నమ్మించి పనికి పిలిపించి మోసం చేస్తున్న ఈ కాంటాక్టర్లపై పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు తీవ్రంగా కోరుతున్నారు.

బద్వేల్ సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీలో కాంటాక్టర్ల దౌర్జన్యం, బాధితుల ఆవేదన
వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని పి.పి.కుంట వద్ద ఉన్న సెంచరీ ప్లైవుడ్ ఫ్యాక్టరీలో బ్లూ బర్డ్ కాంటాక్టర్ల ముఠా దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. కష్టపడి రాత్రింబవళ్లు పనిచేయించుకుని, వేతనాలు అడిగితే కాంటాక్టర్లు ఓబయ్య మరియు మధు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బిల్లులు రాలేదంటూ సాకులతో కాలయాపన చేస్తూ, ఫోన్ చేసినా స్పందించడం లేదని వాపోతున్నారు. నమ్మించి పనికి పిలిపించి మోసం చేస్తున్న ఈ కాంటాక్టర్లపై పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు తీవ్రంగా కోరుతున్నారు.

