Tuesday, 15 September 2026
  • Home  
  • ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులా?: జక్కంపూడి రాజా
- తూర్పు గోదావరి

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులా?: జక్కంపూడి రాజా

రాజమహేంద్రవరం: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం, వారి వ్యక్తిగత ఆందోళనలను అణచివేయడం ఎంతవరకు సమంజసమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నాయకుడు జక్కంపూడి రాజా ప్రశ్నించారు. మంగళవారం రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించడం సహజమైన విషయమని అన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడం, వారి ఆందోళనలను అణచివేయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు అనేక రకాల నిరసన కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై అప్పట్లో వివిధ రకాల ఆందోళనలు, నిరసనలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను, హామీలను నెరవేర్చాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారని జక్కంపూడి రాజా అన్నారు. అయితే అటువంటి ప్రశ్నలను స్వీకరించి, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం.. ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టడం సరికాదని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును గౌరవించాలని, శాంతియుతంగా నిరసనలు తెలిపే వారిపై అణచివేత ధోరణి అవలంబించకూడదని జక్కంపూడి రాజా పేర్కొన్నారు. Uploaded Video:

రాజమహేంద్రవరం: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం, వారి వ్యక్తిగత ఆందోళనలను అణచివేయడం ఎంతవరకు సమంజసమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నాయకుడు జక్కంపూడి రాజా ప్రశ్నించారు. మంగళవారం రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించడం సహజమైన విషయమని అన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడం, వారి ఆందోళనలను అణచివేయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు అనేక రకాల నిరసన కార్యక్రమాలు నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై అప్పట్లో వివిధ రకాల ఆందోళనలు, నిరసనలు చేపట్టారని తెలిపారు.
ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను, హామీలను నెరవేర్చాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారని జక్కంపూడి రాజా అన్నారు. అయితే అటువంటి ప్రశ్నలను స్వీకరించి, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం.. ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టడం సరికాదని విమర్శించారు.
ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును గౌరవించాలని, శాంతియుతంగా నిరసనలు తెలిపే వారిపై అణచివేత ధోరణి అవలంబించకూడదని జక్కంపూడి రాజా పేర్కొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.