విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని, భూ భారతి చట్టంలోని 22-A నిబంధనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నేడు ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించనున్నారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.



