విశాఖపట్నం
నీట్ యూజీ-2026 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు (స్త్రీ, పురుషులకు) జూన్ 21న ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ నూతన ఒరిజినల్ హాల్ టికెట్ చూపించి మాత్రమే ఉచితంగా ప్రయాణించవచ్చని, పాత హాల్ టికెట్లు, ఫోటోకాపీలు లేదా ఇతర పత్రాలు చెల్లవని స్పష్టం చేశారు. ఈ సౌకర్యం పరీక్ష రోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునేలా ముందుగానే ప్రయాణ ప్రణాళిక రూపొందించుకోవాలని, తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. విద్యార్థులందరూ ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసి మంచి ఫలితాలు సాధించాలని జాయింట్ కలెక్టర్ ఆకాంక్షించారు.


