రాత్రివేళ జాతీయ, రాష్ట్ర రహదారులపై నిద్రమత్తు కారణంగా జరిగే ప్రమాదాల నివారణకు నెల్లూరు జిల్లా పోలీసులు “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం చేపట్టారు. డ్రైవర్లను సురక్షిత ప్రాంతాల్లో ఆపి ముఖం కడుక్కోవడం, నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. టోల్ప్లాజాలు, ప్రధాన మార్గాల్లో వాహన భద్రతా పరికరాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, అక్రమ రవాణాపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలను డయల్-112కు తెలియజేయాలని కోరారు. జిల్లా ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలి.

నిద్రమత్తు ప్రమాదాలకు ‘ఫేస్ వాష్’ చెక్
రాత్రివేళ జాతీయ, రాష్ట్ర రహదారులపై నిద్రమత్తు కారణంగా జరిగే ప్రమాదాల నివారణకు నెల్లూరు జిల్లా పోలీసులు “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం చేపట్టారు. డ్రైవర్లను సురక్షిత ప్రాంతాల్లో ఆపి ముఖం కడుక్కోవడం, నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. టోల్ప్లాజాలు, ప్రధాన మార్గాల్లో వాహన భద్రతా పరికరాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, అక్రమ రవాణాపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలను డయల్-112కు తెలియజేయాలని కోరారు. జిల్లా ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలి.

