ఖమ్మం ఆగష్టు 12
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం నగరంలో ఈ నెల 13న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఖమ్మం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మందా సరస్వతి తెలిపారు. పేవిలియన్ గ్రౌండ్ నుంచి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. దేశభక్తి, జాతీయవాద భావాలు కలిగిన ప్రజలు, మహిళలు, యువత, విద్యావంతులు, మేధావులు, డాక్టర్లు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. జై హింద్, జై భారత్ నినాదాలతో జాతీయ ఐక్యతను చాటాలని కోరారు.



