సంగం మండలం పెరమన, కొరిమెర్ల, సంగం ప్రాంతాల్లో గ్రావెల్ కోసం తిప్పల తవ్వకాలు భారీగా సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నామమాత్రపు అనుమతులతో అధికంగా తవ్వకాలు చేసి తరలిస్తున్నారని స్థానికులు అంటున్నారు. అధికారులు గతంలో తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించినప్పటికీ వాటి వసూళ్లు ఇంకా పూర్తి కాలేదని సమాచారం. నెల్లూరుపాళెం, నారంపేట, వెంకట్రావుపల్లి తదితర ప్రాంతాల్లో కూడా తవ్వకాలు కొనసాగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు వేగవంతం చేయాలని కోరుతున్నారు.

తిప్పల తవ్వకాల దందా : పట్టించుకునే నాథుడే లేడా?
సంగం మండలం పెరమన, కొరిమెర్ల, సంగం ప్రాంతాల్లో గ్రావెల్ కోసం తిప్పల తవ్వకాలు భారీగా సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నామమాత్రపు అనుమతులతో అధికంగా తవ్వకాలు చేసి తరలిస్తున్నారని స్థానికులు అంటున్నారు. అధికారులు గతంలో తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించినప్పటికీ వాటి వసూళ్లు ఇంకా పూర్తి కాలేదని సమాచారం. నెల్లూరుపాళెం, నారంపేట, వెంకట్రావుపల్లి తదితర ప్రాంతాల్లో కూడా తవ్వకాలు కొనసాగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు వేగవంతం చేయాలని కోరుతున్నారు.

