నిజామాబాద్ జిల్లా లో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నూతన లబ్ధిదారులకు స్మార్ట్ కార్డ్ అందించారు, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, రూలర్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ప్రజాప్రతినిధులు, రేషన్ డీలర్లు గ్రామ సర్పంచులు ఉప సర్పంచ్లు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజలకు భారీ ఎత్తున ప్రజలు రావడంతో ఆనందం వ్యక్తం చేశారు…. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతంలో లబ్ధిదారులకు అందాల్సిన బియ్యం అందించి లేనివారికి ఒక రెండు కిలోల బియ్యం ఎక్కువచ్చిన పర్వాలేదని సభ ముఖం మీద తెలిపారు, రైస్ మిల్లలో అవకతవకలు జరుగుతున్నాయని సుదర్శన్ రెడ్డికి పేర్కొన్నారు, ఎస్ ఐ ఆర్ సర్వేలో భాగంగా కొన్ని ఓట్లను తొలగించారు, మళ్లీ కొన్నిచోట్ల యాడ్ అయినట్లు తెలిసిందన్నారు ప్రభుత్వం వెంటనే తొలగించాలని సుదర్శన్ రెడ్డికి తెలిపారు….



