పున్నమి న్యూస్ వెల్దుర్తి ప్రతినిధి ఆగస్టు:15
స్వాతంత్య్ర సమరయోధుల వీరోచిత పోరాటలు, అహింసా మార్గాలే నేటి జాతికి ఆదర్శం అని టీడీపీ యువ నాయకులు గౌతమ్ జూలకంటి ఉద్ఘాటించారు. వెల్దుర్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, మాచర్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో గౌతమ్ ముఖ్య అతిధిగా పాల్గొని, త్రివర్ణ జెండాను ఎగవేసి, మహనీయులకు నివాళుర్పించారు. విద్యార్ధులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆటపోటీలు, విద్యలో రాణిస్తున్న విద్యార్ధులకు ప్రోత్సహకాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



