తిరుమల సెప్టెంబర్ 07 పున్నమి ప్రతినిధి
హైదరాబాద్ బంజారాహిల్స్కు చెందిన కుంచాల మధురాం రెడ్డి విరాళం
టిటిడి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్కు హైదరాబాద్ బంజారాహిల్స్కు చెందిన ప్రముఖ దాత శ్రీ కుంచాల మధురాం రెడ్డి రూ.1.11 కోట్ల భారీ విరాళాన్ని అందించారు.
సోమవారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడును కలిసి దాత ఈ విరాళాన్ని అందజేశారు.
గోసంరక్షణ, గోసేవకు పెద్దపీట వేస్తున్న టీటీడీకి అండగా నిలిచి, భారీ విరాళం అందించిన దాత శ్రీ కుంచాల మధురాం రెడ్డిని చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు అభినందించారు.
గోవుల సంరక్షణకు దాతలు అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదని, భక్తులు, దాతల సహకారంతో టీటీడీ గోసంరక్షణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తుందని తెలిపారు.
————
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి విడుదల చేసినది


