వెల్దండ:-
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సందర్భంగా వెల్దండ స్థానిక గ్రామ ముదిరాజ్ సంఘం కార్యాలయంలో ముదిరాజ్ సంఘం నాయకులు తెలంగాణ ముదిరాజ్ మహాసభ 11వ వార్షికోత్సవ వేడుకలను జరిపి, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ జండా ఆవిష్కరించి అనంతరం మాట్లాడుతూ..
ముదిరాజులను బిసి-డి నుంచి బీసీ-ఏ ల్లోకి మార్చాలని, సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం తెలంగాణ బిసి కమిషన్ తగిన అదేశాలను జారీ చేసి ముదిరాజ్లకు న్యాయం చేయాలని కోరారు. ముదిరాజుల సంఖ్య పరంగా అభివృద్ధి కోసం బడ్జెట్లో 20,000 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మత్స్యశాఖకు 3000 వేల కోట్ల రూపాయలను కేటాయించి వివిధ పథకాల ద్వారా మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని తెలిపారు.50ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వృద్ధాప్య మత్స్యకార అభయహస్తం ప్రారంభించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకారుల డైరెక్టర్ క్యాసరపు వెంకయ్య ముదిరాజ్, జిల్లా నాయకులు బయ్య మల్లయ్య, పిల్లి దేవేందర్ ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు బాదేపల్లి మల్లేష్ ,ముదిరాజ్ మహాసభ మండల యూత్ అధ్యక్షుడు బొక్కల శ్రీనివాస్,నాయకులు రంగరాతి శ్రీశైలం , మారేపల్లి శ్రీనివాస్ ,సదమోని బాలక


