ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్ )
ఖమ్మం: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే నేడు ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు గడ్డం వేణును పరామర్శించేందుకు ఆయన జిల్లాకు వస్తున్నారు.
శనివారం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కావడం లేదనే మనస్తాపంతో గడ్డం వేణు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వేణును గణేష్ కుండే పరామర్శించి, కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పనున్నట్లు బీజేవైఎం నాయకులు తెలిపారు.


