కున్సీ గ్రామ గేట్ వద్ద కర్ణాటక రాష్ట్ర బస్సులను నిలిపేందుకు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి హామీ ఇచ్చినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. గత నెల 15న తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరిని కలిసి సమస్యను వివరించగా, యాదగిరి, గుల్బర్గా బస్ డిపో మేనేజర్లతో పాటు కర్ణాటక రవాణా శాఖ మంత్రితో మంత్రి శ్రీహరి మాట్లాడారు. ఈ సందర్భంగా బస్సుల నిలుపుదలకు హామీ లభించడంతో కున్సీ గ్రామ ప్రజలు మంత్రి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీరామలింగప్ప, రాజప్ప గౌడ్, నల్లె శ్రీనివాసులు, కే. నారాయణ, ఎం.డి. అన్వర్, పి. సురేష్, పి. సిద్ధప్ప, పి. శరణప్ప గౌడ్, బి. శరణబసవ తదితరులు పాల్గొన్నారు.

కున్సీ గేట్ వద్ద బస్సుల నిలుపుదలకు హామీ
కున్సీ గ్రామ గేట్ వద్ద కర్ణాటక రాష్ట్ర బస్సులను నిలిపేందుకు ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి హామీ ఇచ్చినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. గత నెల 15న తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరిని కలిసి సమస్యను వివరించగా, యాదగిరి, గుల్బర్గా బస్ డిపో మేనేజర్లతో పాటు కర్ణాటక రవాణా శాఖ మంత్రితో మంత్రి శ్రీహరి మాట్లాడారు. ఈ సందర్భంగా బస్సుల నిలుపుదలకు హామీ లభించడంతో కున్సీ గ్రామ ప్రజలు మంత్రి శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీరామలింగప్ప, రాజప్ప గౌడ్, నల్లె శ్రీనివాసులు, కే. నారాయణ, ఎం.డి. అన్వర్, పి. సురేష్, పి. సిద్ధప్ప, పి. శరణప్ప గౌడ్, బి. శరణబసవ తదితరులు పాల్గొన్నారు.

