* రోడ్డు ప్రమాదం*
*సూళ్లూరుపేట, సెప్టెంబర్ 19, 2026:*
సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని *కాళంగి బ్రిడ్జి వద్ద శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో* భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
బ్రిడ్జిపై ముందు వెళ్తున్న *ట్రాక్టర్ వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో* ఈ ప్రమాదం జరిగింది. లారీ వేగంగా ఉండటం, బ్రిడ్జిపై ఉండటంతో డ్రైవర్ అదుపు తప్పి ట్రాక్టర్ ను ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
లారీ ఢీకొట్టిన ధాటికి ట్రాక్టర్ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
బ్రిడ్జిపైనే ప్రమాదం జరగడంతో *కొద్దిసేపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం* ఏర్పడింది. ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.
*అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.* ట్రాక్టర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు.
ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు, వాహనాలకు జరిగిన నష్టంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వాహనదారులు బ్రిడ్జిపై నెమ్మదిగా, జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
*📍 ఘటన స్థలం: సూళ్లూరుపేట – కాళంగి బ్రిడ్జి*
*🕛 సమయం: మధ్యాహ్నం 12:00 గంటలుకు


