తెలంగాణలో అత్యవసర సేవలను మరింత వేగవంతం చేసేలా డైల్-100 స్థానంలో 112ను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవలను రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ప్రారంభించారు. ఇకపై పోలీస్, అగ్నిమాపక, అంబులెన్స్ తదితర అన్ని అత్యవసర సేవల కోసం 112 నంబర్ను వినియోగించాలని ప్రజలకు సూచించారు. ఒకేసారి 960 కాల్స్ను స్వీకరించేలా వ్యవస్థను అప్గ్రేడ్ చేయడం విశేషం. ప్రతి ఒక్కరూ 112 నంబర్ను తమ మొబైల్లో సేవ్ చేసుకోవాలని డీజీపీ కోరారు.



