*రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు* గారి ఆధ్వర్యంలో జనసేన నేతలు రాష్ట్ర ఎంఎస్ఎంఈ చైర్మన్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ గారిని బుధవారం విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడం, రానున్న రాజకీయ పరిణామాలు, స్థానికంగా పార్టీని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడం తదితర అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల్లో జనసేన పాత్రతో పాటు పలు కీలక రాజకీయ అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు, జనసేన నేత యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


