పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా: కోడేరు మండల పరిధిలో నాగులపల్లి సిరిగిరి కృష్ణ ఆయన కుమార్తె సిరిగిరి లావణ్య ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాలలో ప్రతిభ కనబరిచిన లావణ్య గవర్నమెంట్ పాఠశాలలో చదివి 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించారు. ఈ సందర్భంగా బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప అభినందించారు ఆయన మాట్లాడుతూ కష్టపడి చదివి ఈ విజయాన్ని సాధించిన వారిని వెన్నంటి నిలబెట్టి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజానికి గర్వకారణంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా అధ్యక్షులు దూపం అంజనేయులు, ధూపం శ్రీనివాసులు, సిరిగిరి కృష్ణ, దుద్దుకురి నరేష్, చెలిమిండ్ల శీను, సిరిగిరి ముత్తాలు, గగనం చంద్రయ్య, మోతే రామస్వామి, గగనం రాజు, గగనం మహేష్, ధూపం ధన, ధూపం శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.



