🔹కల్వకుర్తి ఎమ్మెల్యే కసి రెడ్డి నారాయణరెడ్డి.
🔸గ్రామ సర్పంచి మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్.
వెల్దండ:-
దేశంలోనే నిరుపేదలకు అత్యధికంగా ఇళ్లు పంపిణీ చేసింది కాంగ్రెస్ పార్టీ అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు.
వెల్దండ మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను గ్రామ సర్పంచి మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి చేత ప్రారంభిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలోనే నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు.
గత ప్రభుత్వం ఇళ్ల పేరుతో రాజకీయం చేసేది అని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మోర సుజాత, వానరాసి లక్ష్మీ, వానరాశి భాగ్యమ్మ, వనరాశి పున్నయ్య లు గృహ ప్రవేశాలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు యెన్నం భూపతి రెడ్డి, వావిళ్ళ సంజీవ కుమార్, కిసాన్ సెల్ పర్వత్ రెడ్డి, కాయితీ విజయేందర్ రెడ్డి,ఉప సర్పంచి ఎర్ర శ్రీను, కాంగ్రెస్ మండల అధ్యక్షులు హరికిషన్, మాజీ మండల అధ్యక్షులు ముడావత్ మోతీలాల్, వార్డుసభ్యులు వాణి పురుషోత్తం, శేఖర్, కిష్టల్, కవిత రమేష్ ,వెంకటేష్ , కొండయ్య, మంజుల శ్రీను, దేవేందర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మట్ట భరత్ , తిరుపతి రెడ్డి , రషీద్, బాదేపల్లి మల్లయ్య, మాసుల బాలరాజు, రేవల్లి రాజు, జంగిలి ఆనంద్ రాజు,కృపానందం, కొయ్యల పుల్లయ్య, హమీద్ తదితరులు పాల్గొన్నారు.





