సీనియర్ జర్నలిస్ట్ రమణ, నవంబర్ 24: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్డులను ఆబెడ్కర్ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారు గత వైసీపీ ప్రభుత్వం లో కొంతమందికి ఇచ్చి మరల క్యాన్సిల్ చేయడం జరిగింది. పేద ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి వైద్యం చేయించుకోలేక అనేక ఇబ్బందులు పడుతు అప్పుల పాలవుతున్నారు కనుక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరన్నర గడుస్తున్నా ఇంకా పేద ప్రజలకు ఇవ్వాల్సిన ఆయుష్మాన్ భారత్ కార్డులను ఇవ్వలేదు. కాబట్టి సామాన్య ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్ కార్డులను ప్రభుత్వం తరఫున ఇప్పించి పేద ప్రజలను ఆదుకుంటారని జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నట్లు అమలాపురం కలెక్టరేట్ లో సోమవారం బీజేపీ నేతలు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి అమలాపురం పట్టణ అధ్యక్షులు అయ్యల భాస్కరరావు ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకట సుబ్బరాజు కిసాన్ మార్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరిగెల నాని ఎస్సీ మోర్చా నాయకులు దాకే వెంకటరావు మన్నె రామదాసు యువ మోర్చా నాయకులు పావులూరు వెంకట్ అల్లవరం మండల అధ్యక్షులు కట్ట నారాయణమూర్తి ఉపాధ్యక్షులు కట్ట జనార్ధన్ ఇంకా బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు


